ఘోర రోడ్డు ప్రమాదం ఐపీఎస్ అధికారితో సహా మరో వ్యక్తి మృతి
నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఐపీఎస్ అధికారితో సహా మరో వ్యక్తి మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్ ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం హైవేలో పగవర పల్లి-దోమల పెంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఇన్నోవా కారు ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, వీరిలో మహారాష్ట్ర రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుధాకర్ పటేల్ ఉన్నట్లు గుర్తించారు. వీరు మహారాష్ట్ర నుండి శ్రీశైలం వెళ్లేందుకు బయలుదేరినట్లు సమాచారం. అలాగే, ఈ ఘటనలో మరొక వ్యక్తి భగవత్ కృష్ణారావు తీవ్రంగా గాయపడగా, ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
క్షతగాత్రులను అత్యవసరంగా ఒక ప్రైవేటు అంబులెన్స్ ద్వారా, అలాగే ఈగలపెంట ఎస్సై పోలీసు వాహనంలో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తలపై బలమైన గాయాలతో బాధపడుతున్న ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్, రెండు కాళ్లకు తీవ్ర గాయాలతో బాధపడుతున్న భగవత్ కృష్ణారావును మొదట అచ్చంపేట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అయితే, వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ వెల్దండ సమీపంలోని ఎన్నం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు.
Post a Comment