తెలంగాణకు వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు
తెలంగాణకు వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు - ఏర్పాట్లను సమీక్షించిన పర్యాటకశాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్
హైదరాబాద్: తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ మంగళవారం సమీక్షించారు. చార్మినార్ సమీపంలోని చౌమొహల్లా ప్యాలెస్లో నిర్వహించిన సమావేశంలో, ఆమె సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు.
మిస్ వరల్డ్ పోటీలు మేలో హైదరాబాద్లో
72వ మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుండి 31వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనున్నాయి. ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందచందాల ముద్దుగుమ్మలు పాల్గొననుండగా, వారు మే 6 మరియు 7 తేదీల్లో నగరానికి చేరుకోనున్నారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించబడ్డాయి.
అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
విశిష్ట అతిథుల రాక సందర్భంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్లో వేదికలపై వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకలలో రాష్ట్ర సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్మిత సబర్వాల్ తెలిపారు.
వెల్కమ్ డిన్నర్లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్, సూఫీ మరియు కవ్వాలి సంగీత ప్రదర్శనలు, అలాగే తెలంగాణ సాంస్కృతిక సంపదను ఆవిష్కరించే 20 నిమిషాల సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
120 మంది మోడల్స్తో పాటు అంతర్జాతీయ మాధ్యమ ప్రతినిధులు హాజరు
ఈ పోటీలకు 120 మంది మోడల్స్తో పాటు సుమారు 400 మంది ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు మరియు అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్ నగరం వీరికి సరైన అతిథ్యాన్ని అందించేలా శుభ్రత, భద్రత, వీధి అందం తదితర అంశాల్లో నిఖార్సైన ఏర్పాట్లు చేపట్టాలని ఆమె సూచించారు.
ఇతర శాఖలతో సమన్వయం
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు టూరిజం, జీహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీస్ శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరం అని స్మిత సబర్వాల్ అన్నారు. చౌమొహల్లా ప్యాలెస్లో నిర్వహించే ఫోటోషూట్, సీటింగ్ అరేంజ్మెంట్లు, మ్యూజికల్ ప్రోగ్రామ్లపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు.
Post a Comment