దాది రతన్ మోహినీ జీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
బ్రహ్మకుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా విశిష్ట సేవలు అందించిన రాజయోగిని దాది రతన్ మోహినీ జీ గారి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
దాది జీ జీవితం ఆధ్యాత్మిక బలం, నిర్మలత, విశ్వ సోదరభావానికి ప్రతీకగా నిలిచిందని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆమె జీవిత విధానం ప్రతి ఒక్కరికీ మార్గదర్శిగా నిలిచేలా ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా దేశాల్లో భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను విస్తరించడంలో దాది జీ గారి పాత్ర అమోఘమని గుర్తుచేశారు. సమాజానికి శాంతి, మానవతా విలువల సందేశాన్ని అందించడంలో ఆమె చేసిన కృషి ఎంతో ప్రాధాన్యత కలిగినదని సీఎం తెలిపారు.
దాది జీ గారి మృతి రాష్ట్రానికి, దేశానికి, అంతర్జాతీయ ఆధ్యాత్మిక సముదాయానికి తీరని లోటుగా పేర్కొన్నారు. దాది రతన్ మోహినీ జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు, శిష్యులకూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Post a Comment