బురం శ్రీనివాస్ గృహంలో సన్న బియ్యంతో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనంతరం పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం, సారపాక తాళ్ల గోమ్మూరు గ్రామంలో బురం శ్రీనివాస్ గృహంలో సన్న బియ్యంతో భోజనం జరిగిన విషయం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర నాయకులు సన్న బియ్యంతో భోజనం చేయడం ద్వారా గ్రామ ప్రజలతో కలిసి సామాజిక, సాంస్కృతిక ఉత్సవాన్ని ఉత్సాహంగా జరిపారు.
Post a Comment